తెలంగాణ

telangana

ETV Bharat / international

క్రిస్మస్​ వేళ అమెరికాలో బాంబు పేలుడు కలకలం - ఎఫ్​బీఐ

అమెరికాలో ఓ వాహనంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడిగా భావిస్తున్న ఎఫ్​బీఐ విచారణ చేపడుతోంది.

An explosion that shook the largely deserted streets of downtown Nashville
క్రిస్మస్​ వేళ అమెరికాలో బాంబు పేలుడు కలకలం

By

Published : Dec 26, 2020, 5:15 AM IST

క్రిస్మస్​ వేడుకల్లో మునిగిన అమెరికాలో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. టెనెస్సీలోని నాష్విల్లేలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

చెలరేగిన మంటలు
అమెరికాలో బాంబు పేలుడు

ఉద్దేశపూర్వకంగానే పేలుడు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రదేశంలో ఉన్న శరీరభాగాలు బాధితుడివా లేదా ఈ పేలుడుకు పాల్పడ్డ వ్యక్తివా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు వెనుక ఉగ్రవాదుల కుట్ర ఏమైనా దాగుందా అన్న కోణంలో ఎఫ్​బీఐ విచారణ జరుపుతోంది.

ఇదీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details