తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ 'మిషన్​ శక్తి'పై అగ్రరాజ్యం మిశ్రమ స్పందన

మిషన్​ శక్తిపై భారత్​ నివేదికను పరిశీలించినట్టు అమెరికా తెలిపింది. అంతరిక్షం సహా పలు రంగాల్లో భారత్​తో బంధం కొనసాగుతుందని చెబుతూనే స్పేస్​ వ్యర్థాల సమస్యను ప్రస్తావించింది అగ్రరాజ్యం.

By

Published : Mar 28, 2019, 12:24 PM IST

భారత్​ 'మిషన్​ శక్తి'పై అగ్రరాజ్యం మిశ్రమ స్పందన

భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం మిషన్​శక్తిపై అమెరికా స్పందించింది. అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో భారత్​తో తమకున్న బంధాన్ని కొనసాగిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. కానీ అంతరిక్ష వ్యర్థాల సమస్యపై ఆవేదన వ్యక్తం చేసింది.

"భారత్ చేపట్టిన మిషన్​శక్తి ప్రయోగం నివేదికను గమనించాం. అమెరికా ప్రభుత్వానికి అంతరిక్ష వ్యర్థాల సమస్య ఎంతో ముఖ్యం. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రయోగం చేశామని భారత్​ తెలిపింది."
-అమెరికా ప్రభుత్వ ప్రతినిధి

ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం భూ వాతావరణంలోనే జరిగిందని భారత విదేశాంగశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రయోగం వల్ల ఏర్పడిన వ్యర్థాలు వారం రోజుల్లోనే భూమిపై పడిపోతాయని తెలిపింది. భారత్ చేపట్టిన 'మిషన్​ శక్తి' ప్రయోగం విజయమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఇదీ చూడండీ: భారత్​ 'మిషన్​ శక్తి' విజయంపై పాక్ అక్కసు

ABOUT THE AUTHOR

...view details