తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 5:49 AM IST

ETV Bharat / international

ట్రంప్​ ఫేస్​బుక్​ ఖాతాపై జుకర్​బర్గ్​ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు మార్క్ జుకర్​బెర్గ్​. అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద చెలరేగిన హింస నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత సమయంలో తమ ప్లాట్​ఫాంలను వినియోగించుకునేందుకు అనుమతించటం వల్ల ప్రమాదం అధికంగా ఉంటుందన్నారు.

Donald trump
'ట్రంప్'​ ఫేస్​బుక్​ ఖాతా నిలిపివేత

అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగిన క్రమంలో.. ఆయన సామాజిక మాధ్యమాల ఖాతాలపై చర్యలు చేపట్టాయి యాజమాన్య సంస్థలు. ఇప్పటికే ట్రంప్​ పోస్టు చేసిన వీడియో సందేశాన్ని తొలగించి 24 గంటల పాటు ఖాతాను నిలిపివేసిన ఫేస్​బుక్​ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 20న జో బైడెన్​ ప్రమాణ స్వీకారం వరకు ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​​లోని ట్రంప్​ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఫేస్​బుక్​ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్​బెర్గ్.

" ప్రస్తుత సమయంలో అధ్యక్షుడు ట్రంప్​ తమ ప్లాట్​ఫాంలను వినియోగించుకునేందుకు అనుమతించటం చాలా ప్రమాదకరం. కనీసం వచ్చే రెండు వారాల పాటు ట్రంప్​ ఖాతాలు నిలిపివేయనున్నాం. గత 24 గంటల్లో జరిగిన దిగ్భ్రాంతికర సంఘటనలు.. జో బైడెన్​కు శాంతియుతంగా, చట్టబద్ధంగా అధికార మార్పిడిని అణగదొక్కాలని ట్రంప్​ భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. క్యాపిటల్​ భవనంపై తమ మద్దతుదారుల చర్యలను ఖండించాల్సింది పోయి.. వారికి మద్దతుగా నిలిచేందుకు సామాజిక మాధ్యమ ప్లాట్​ఫాంలను వినియోగిస్తున్నారు. హింసను మరింత రెచ్చగొట్టేలా ఉన్న కారణంగా గురువారం ట్రంప్​ పోస్టులను తొలగించాం."

- మార్క్ జుకర్​బెర్గ్​, ఫేస్​బుక్​ వ్యవస్థాపకుడు.

తమ సొంత నియమాలకు లోబడి గత కొన్నేళ్లుగా అధ్యక్షుడు ట్రంప్​ తమ ప్లాట్​ఫాంలను వినియోగించుకునేందుకు అనుమతించామని గుర్తు చేశారు జుకర్​బెర్గ్​. మా విధానాలను ఉల్లంఘించిన క్రమంలోనే పోస్టులను తొలగించటం, లేబుల్​ చేయటం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వివాదాస్పద ప్రసంగం పట్ల ప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉన్నందునే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

అమెరికా అధ్యక్షుడి ఖాతాలను పేస్​బుక్​.. నిలిపివేయటం, నిషేధం విధించటం వంటి చర్యలు ఇవే తొలిసారి. అగ్రరాజ్య క్యాపిటల్​ భవనం వద్ద హింస చెలరేగిన క్రమంలో ట్విట్టర్​ కూడా ట్రంప్​ ఖాతాలను నిలిపివేసింది. మూడు ట్వీట్లను తొలగించి.. 12 గంటల పాటు నిషేధం విధించింది.

ఇదీ చూడండి:'క్యాపిటల్‌'కు నిలువెల్లా గాయాలే..

ABOUT THE AUTHOR

...view details