తెలంగాణ

telangana

ETV Bharat / international

అతిథిగా వచ్చాడు- రూ.280 కోట్ల రుణాలు తీర్చాడు

అమెరికా అట్లాంటాలోని మోర్​హౌస్  కళాశాలలో స్నాతకోత్సవానికి అతిథిగా వచ్చిన ఓ బిలియనీర్​  అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. విద్యార్థులు తీసుకున్న దాదాపు రూ.280 కోట్ల రుణాలను తాను తీర్చుతున్నట్లు ప్రకటించారు.

By

Published : May 21, 2019, 5:32 AM IST

అతిథిగా వచ్చాడు- రూ.280 కోట్ల రుణాలు తీర్చాడు

అతిథిగా వచ్చాడు- రూ.280 కోట్ల రుణాలు తీర్చాడు

అమెరికా అట్లాంటాలోని మోర్​హోస్ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రారంభ వ్యాఖ్యాతగా హాజరయ్యారు బిలియనీర్ రాబర్ట్ ఎఫ్​ స్మిత్​. ప్రసంగించేందుకు వేదికపైకి వెళ్లాక విద్యార్థులందరినీ ఒకరినొకరు ఆలింగనం చేసుకోమన్నారు. కాసేపయ్యాక వాళ్లందరికీ అద్భుత కానుక ప్రకటించి అక్కడున్న వారందరినీ ఒక్క క్షణం పాటు ఆశ్చర్యానికి గురిచేశారు.

పట్టభద్రులవుతున్న విద్యార్థులు తీసుకున్న రూ.280కోట్ల మొత్తం రుణాలను తాను తీరుస్తానని చెప్పారు రాబర్ట్​. అమెరికాలో వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించిన తన కుటుంబం తరఫున విద్యార్థులకు ఈ బహుమతి ఇస్తున్నట్లు చెప్పారు. కళాశాలకు ఇదే అతిపెద్ద బహుమానమని యాజమాన్యం తెలిపింది. స్మిత్​ ఇదివరకే 1.5 మిలియన్ డాలర్లను కళాశాలకు విరాళంగా ఇచ్చారని వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్​ను అందుకున్నారు స్మిత్​. భవిష్యత్తు పట్టభద్రుల రుణాలను ప్రస్తుత విద్యార్థులు తీర్చి ఈ పద్ధతిని కొనసాగించాలని సూచించి..అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఇదీ చూడండి:ఎగ్జిట్​పోల్స్​లో కచ్చితత్వం ఎంత? గతంలో ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details