తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​ నౌకలో పెరుగుతున్న కరోనా కేసులు - జపాన్​ నౌకలోని మరో 99మందికి కరోనా

జపాన్​ తీరంలోని నౌకలో మరో 99మందికి కరోనా సోకిందని సమాచారం. కొత్తగా వ్యాధి లక్షణాలు నిర్ధరణ అయినవారిలో 14 మంది అమెరికా పౌరులూ ఉన్నట్లు వైద్యులు నిర్ధరించినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఇప్పటివరకు డైమండ్​ ప్రిన్సెస్​ నౌకలో 454 మంది వైరస్​ బారిన పడ్డారని జపాన్​ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.

99 more coronavirus cases on Japan cruise ship: media
జపాన్​ నౌకలోని మరో 99మందికి కరోనా

By

Published : Feb 17, 2020, 9:14 PM IST

Updated : Mar 1, 2020, 4:01 PM IST

జపాన్​ తీరంలోని నౌక​లో మరో 99మందికి కరోనా సోకిందని ప్రకటించింది జపాన్. డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని వారిలో ఇప్పటివరకు 454 మంది కరోనా​ బారిన పడ్డారని జపాన్ ఆరోగ్య మంత్రి ప్రకటన విడుదల చేశారు.

14మంది అమెరికన్లకు కరోనా

నౌకలో 300లకు పైగా అమెరికన్లు ఉన్నారు. వీరిలో 14 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయిందని అమెరికా అధికార వర్గాలు ప్రకటించాయి.

ప్రత్యేక విమానాల్లో అమెరికాకు..

జపాన్ నౌకలోని అమెరికన్లను వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలు పంపించింది అగ్రరాజ్యం. ఈ ప్రత్యేక విమానాల ద్వారా నౌకలోని అమెరికన్లు టెక్సాస్​ రాష్ట్రంలోని లాక్​ల్యాండ్​ విమానాశ్రయానికి చేరుకున్నారు. వెనక్కి వెళ్లిన వారిని 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉంచనున్నారు. అదేసమయంలో కరోనా సోకిన 14మంది బాధితులను ప్రత్యేకంగా ఉంచి వైద్యసేవలు అందించనున్నారు.

ఇదీ చూడండి:నెల రోజుల్లో కురవాల్సిన వాన 48 గంటల్లో పడితే...

Last Updated : Mar 1, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details