Plane Crash: పెరూలో తేలికపాటి విమానం కూలి ఏడుగురు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
ఆ విమానం పర్యటక సంస్థ ఏరో శాంటోస్కు చెందిందిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో ఐదురుగురు పర్యటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.