తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా నుంచి 13 శాతం కంపెనీలు వెళ్లిపోతాయి: ట్రంప్

చైనావస్తువులపై అమెరికా విధించబోయే నూతన సుంకాలతో ఆ దేశం నుంచి 13శాతం కంపెనీలు వెళ్లిపోతాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్​ జోస్యం చెప్పారు. కొద్ది రోజుల్లోనే ఇది జరుగుతుందన్నారు.

By

Published : Aug 31, 2019, 1:15 PM IST

Updated : Sep 28, 2019, 11:17 PM IST

చైనా నుంచి 13 శాతం కంపెనీలు వెళ్లిపోతాయి: ట్రంప్

అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక చైనా వస్తువులపై సుంకాలు పెంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర తీశారు డొనాల్డ్​ ట్రంప్. అప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు జరుగుతూనే ఉంది.

సెప్టెంబరు 1నుంచి చైనా వస్తువులపై మరోసారి సుంకాల మోత మోగించనున్నారు ట్రంప్​. ఈ చర్యతో చైనా నుంచి 13 శాతం కంపెనీలు తిరుగుముఖం పడతాయని జోస్యం చెప్పారు. శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

సుంకాల పెంపును చైనాలోని కంపెనీలు భరించలేవన్నారు ట్రంప్​. ఆ దేశం నుంచి వెళ్లిపోయే కంపెనీల సంఖ్య 13శాతం దాటినా ఆశ్యర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము నూతనంగా విధించే సుంకాలతో చైనా కంపెనీలు పోటీలో నిలబడలేవని స్పష్టం చేశారు.

చైనా నుంచి ఇప్పటికే చాలా వ్యాపార సంస్థలు వెళ్లిపోతున్నాయని చెప్పిన ట్రంప్​.. గత 61 ఏళ్లలో అత్యంత విపత్కర పరిస్థితిని చైనా ఈ ఏడాది ఎదుర్కొంటుందన్నారు.

అమెరికా-చైనా మధ్య సెప్టెంబరులో జరగాల్సిన సమావేశం యథావిధిగా ఉంటుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. సంకాలు అమెరికాను చర్చల పరంగా ఉన్నత స్థాయిలో నిలిపాయన్నారు.

ఇదీ చూడండి: డొమినికన్​ రిపబ్లిక్​లో 'గాంధీజీ' పోస్టల్​ స్టాంప్

Last Updated : Sep 28, 2019, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details