ఐరోపాకు వెళ్తున్న 11 మంది వలసదారులు లిబియా తీరంలో మరణించారు. వారు ప్రయాణిస్తున్న పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయిందని అంతర్జాతీయ వలసవాద సంస్థ(ఐఓఎం) వెల్లడించింది. మృతిచెందినవారిలో ఓ గర్భిణీ సైతం ఉందని తెలిపింది.
పడవలో ప్రయాణిస్తున్న మరో 10 మందిని లిబియా తీర రక్షక దళం కాపాడిందని ఐఓఎం ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. ఇది.. వారం రోజుల వ్యవధిలో మధ్యధరా సముద్రంలో జరిగిన మూడో పడవ ప్రమాదమని తెలిపారు.