తెలంగాణ

telangana

By

Published : Jun 5, 2019, 2:12 PM IST

ETV Bharat / international

సూడాన్​ నిరసనల్లో 60కి చేరిన మృతులు

సూడాన్​లో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. రాజధాని ఖర్తౌమ్​తో​ పాటు దేశవ్యాప్తంగా జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 60 మంది చనిపోయినట్లు సూడాన్​ వైద్యుల కమిటీ తెలిపింది.

సుడాన్​ నిరసనల్లో 60కి చేరిన మృతుల సంఖ్య

సూడాన్​లో సైనిక పాలనను తొలగించి... ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖర్తౌమ్​లోని ఆర్మీ హెడ్​క్వార్టర్స్​ ఎదుట నిరసనలు చేస్తోన్న వారిపై సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలొదిలారు. వందల మంది గాయపడ్డారు.

గడిచిన వారం రోజుల్లోఖర్తౌమ్​తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రజాస్వామ్య స్థాపన నిరసనల నిర్వాహకులు పేర్కొన్నారు. అంతకు ముందు 40 మంది చనిపోయినట్లు ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలిపారు.

ఖర్తౌమ్​, ఓమ్​దుర్మాన్​ నగరాల్లో బుధవారం సుమారు 10 మందిని భద్రతా దళాలు కాల్చివేశాయని సూడాన్​ వైద్యుల కమిటీ తెలిపింది. అంతకు ముందు రోజు కూడా 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వైట్​ నైల్​ స్టేట్​లో ఐదుగురు, ఓమ్​దుర్మాన్​లో ముగ్గురు, బహ్రీలో ఇద్దరు చనిపోయినట్లు కమిటీ తెలిపింది.

ఇదీ చూడండి:మహిళను కాల్చి చంపిన ఉగ్రవాదులు

ABOUT THE AUTHOR

...view details