కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేయాలని నిర్ణయించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఈ మేరకు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటన విడుదల చేశారు. ఐదు దశల్లో ఆంక్షలను సడలించనున్నట్లు స్పష్టం చేశారు.
మార్చి 27నుంచి దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఐదో దశలో..
ప్రస్తుతం దేశంలో ఐదో దశ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఆర్థిక సంక్షోభం, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాల మూసివేతకు లాక్డౌన్ కారణమవుతోంది. ఈ నేపథ్యంలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయనున్నారు.
నాలుగో దశలో..
పలు కఠిన ఆంక్షలతో కొన్ని వ్యాపారాలను ప్రారంభిస్తారు. సరిహద్దుల మూసివేత కొనసాగుతుంది. ప్రయాణాలపై ఆంక్షలు యధావిధిగా ఉంటాయి. విదేశాల్లోని దక్షిణ ఆఫ్రికా పౌరులను స్వదేశానికి తీసుకువస్తారు. దేశంలో ఉన్న విదేశీయులను స్వదేశాలకు పంపించేందుకు మాత్రమే ఏర్పాట్లు చేస్తారు.
మూడో దశలో..