తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2021, 8:01 PM IST

Updated : Nov 2, 2021, 9:26 PM IST

ETV Bharat / international

కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం

దక్షిణ సుడాన్​లో విమానం కూలి ఐదుగురు చనిపోయారు. రాజధాని జుబా నుంచి టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Official: 5 killed when cargo plane crashes in South Sudan
కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం

దక్షిణ సుడాన్​ రాజధాని జుబాలో కార్గో విమానం కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. కూలిన విమానం ఆప్టిమమ్ ఏవియేషన్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించారు.

జుబా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి బయలుదేరిన విమానం టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. చనిపోయిన ఐదుగురులో పైలెట్​తో పాటు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు రష్యాకు చెందిన వారు కాగా.. మిగతావాళ్లు దక్షిణ సుడాన్​కు చెందిన వారని చెప్పారు.

విమానం ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఇంధనం కూడా ఉన్నట్లు ఎయిర్​పోర్ట్​ వర్గాలు తెలిపాయి.

Last Updated : Nov 2, 2021, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details