తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2020, 9:19 AM IST

Updated : Mar 2, 2020, 3:50 AM IST

ETV Bharat / international

జాయింట్​ ఆపరేషన్​లో 120 మంది ఉగ్రవాదులు హతం

ఆఫ్రికాలోని నైజర్​లో నైజీరియా, ఫ్రెంచ్​ దళాలు ఓ జాయింట్​ ఆపరేషన్​ నిర్వహించాయి. ఇందులో 120 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి భారీ విస్ఫోటక తయారీ పదార్థాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Niger military operation kills 120 'terrorists': official
జాయింట్​ ఆపరేషన్​లో 120 మంది ఉగ్రవాదుల హతం

ఆఫ్రికాలోని నైజర్​లో.. నైజీరియన్​, ఫ్రెంచ్​ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో 120 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మాలి-బుర్కినా ఫోసో సరిహద్దు సమీపంలోని తిల్లాబెరి వద్ద ఈ ఆపరేషన్​ జరిగింది.

ఘటనాస్థలం నుంచి బాంబు తయారీ పరికరాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఘటనలో ఇరు దళాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నైజర్​ రక్షణ శాఖ స్పష్టం చేసింది.

Last Updated : Mar 2, 2020, 3:50 AM IST

ABOUT THE AUTHOR

...view details