తెలంగాణ

telangana

ETV Bharat / international

నైజర్​ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి

By

Published : Mar 23, 2021, 4:06 AM IST

Updated : Mar 23, 2021, 4:26 AM IST

Niger govt confirms 137 dead in village attacks near Mali
నైజర్​ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి

03:58 March 23

నైజర్​ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి

నైజర్​లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలపై మోటార్​సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఊచకోతకు పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 137 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇస్లామిక్​ తీవ్రవాదులే ఈ ఘటనకు కారణమని భావిస్తోంది. 

నైజర్​ కొత్త అధ్యక్షుడిగా మహ్మద్​ బజౌమ్​ ఎన్నిక నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఎన్నికల్లో మహ్మద్​ గెలిచినట్లు.. నైజర్స్​ కాన్​స్టిట్యుషనల్​ కోర్టు ఆదివారమే అధికారికంగా ప్రకటించింది. పొరుగున ఉన్న మాలీలో ఇస్లామిక్​ తిరుగుబాటు ప్రభావం నైజర్​పై పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ బజౌమ్​ ఏప్రిల్​ 2న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ తరుణంలోనే ముష్కరులు తెగబడ్డారు. 

జనవరిలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పుడు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం మార్కెట్​కు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సమూహంపైనా తీవ్రవాదులు దాడి చేయగా.. 66 మంది చనిపోయారు. 

ఇదీ చూడండి: గ్రామాలపై తీవ్రవాదుల దాడి- 100 మంది మృతి

Last Updated : Mar 23, 2021, 4:26 AM IST

ABOUT THE AUTHOR

...view details