తెలంగాణ

telangana

ETV Bharat / international

మొజాంబిక్​లో 417కు చేరిన ఇదాయ్​ మృతుల సంఖ్య

మొజాంబిక్​లో ఇదాయ్​ తుపాను తీరని నష్టం మిగిల్చింది. ఇప్పటి వరకు 417 మంది మరణించినట్లు ప్రకటన విడుదల చేసింది ఆ దేశ ప్రభుత్వం. 90 వేల మందిని శిబిరాలకు తరలించినట్టు వెల్లడించింది.

By

Published : Mar 23, 2019, 7:19 PM IST

మొజాంబిక్​లో 417కు చేరిన ఇదాయ్​ మృతుల సంఖ్య

మొజాంబిక్​లో 417కు చేరిన ఇదాయ్​ మృతుల సంఖ్య
ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతంలోని మొజాంబిక్ దేశానికి ఇదాయ్​ తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. వేల మైళ్ల మేర బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావం తగ్గినా... వరదల నుంచి ఇంకా కోలుకోలేదు ఆ దేశం. విపత్తు వల్ల ఇప్పటి వరకు 417 మందికిపైగా మరణించారని ప్రభుత్వం ప్రకటించింది.

సెంట్రల్​ మొజాంబిక్​లో వర్షం ధాటికి గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరదలు తగ్గినప్పటికీ చాలా ప్రాంతాలు బురదమయమయ్యాయి.

సుమారు 90 వేల మంది మొజాంబిక్​ వాసులను శిబిరాలకు తరలించారు. ఇంకా వేల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్లు తెలిపారు అధికారులు. సుమారు 10 లక్షల మంది తుపాను ప్రభావానికి గురైనట్లు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details