తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి - Eight babies killed

అల్జీరియాలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి

By

Published : Sep 24, 2019, 8:47 PM IST

Updated : Oct 1, 2019, 9:18 PM IST

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి

అల్జీరియా ఔడ్​ సౌఫ్​లోని​ ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించగా ఆసుపత్రిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరు చిన్నారులు కాలిన గాయాలతో ప్రాణాలు విడిచారు. మరికొందరు దట్టమైన పొగ మధ్య ఊపిరాడక చనిపోయారు.

సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. దోమల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్​ పరికరం షార్ట్ సర్క్యూట్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఇదీ చూడండి : 'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్​

Last Updated : Oct 1, 2019, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details