తెలంగాణ

telangana

బంగారం గనిలో ప్రమాదం.. 50 మంది మృతి

కాంగోలో బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరిపి 50 మంది ప్రాణాలను కోల్పోయారు. తవ్వకాలు చేస్తుండగా గని ఒక్కసారిగా కూలడం వల్ల ఈ ఘటన జరిగింది.

By

Published : Sep 12, 2020, 11:49 AM IST

Published : Sep 12, 2020, 11:49 AM IST

Updated : Sep 12, 2020, 12:38 PM IST

Dozens feared dead after collapse at DRC gold mine
అక్రమంగా బంగారం తవ్వుతున్న 50 మంది బలి!

కాంగో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గని కూలిన ఘటనలో 50 మంది మృతిచెందారు. ఈ ఘటన తూర్పున ఉన్న కమితుగ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అక్కడ బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

కాంగోలో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఉన్న కెనడా మైనింగ్‌ కంపెనీ బన్రో కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం ప్రమాదం చోటుచేసుకున్న గని లేదని అధికారులు తెలిపారు. కాంగోలో అక్రమ తవ్వకాలు సర్వసాధారణం. తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

అక్రమంగా బంగారం తవ్వుతున్న 50 మంది బలి!

ఇదీ చదవండి:'ఇట్లు.. మీ అన్నయ్య ప్రధాని నరేంద్ర మోదీ'

Last Updated : Sep 12, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details