ఇథియోపియా పశ్చిమ బెనిషాంగుల్-గుముజ్ రాష్ట్రంలో జరిగిన సాయుధదాడిలో 207మంది మరణించినట్లు ఇథియోపియా మానవహక్కుల కమిషన్(ఈహెచ్ఆర్సీ)తెలిపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ రక్తపాతంలో 133 మంది మగవారు, 35 మంది మహిళలు, 20మంది వృద్ధులు, మరో 17 మంది చిన్న పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. స్థానికులు నిద్రిస్తున్న సమయంలో ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
ఇథియోపియా సాయుధదాడిలో 207కు చేరిన మరణాలు - ఇథియోపియా మానవహక్కుల కమిషన్
ఇటీవల ఇథియోపియాలో జరిగిన మారణహోమంలో 207మంది మరణించినట్లు ఆ దేశ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.
![ఇథియోపియా సాయుధదాడిలో 207కు చేరిన మరణాలు Death toll in Ethiopia armed attack climbs to 207](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10016382-101-10016382-1608985077309.jpg)
ఇథియోపియా:సాయుధదాడిలో 207కు చేరిన మరణాలు
గుర్తింపు కార్డులను ఉపయోగించి మృతులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈహెచ్ఆర్సీ వివరించింది. చనిపోయిన వారిని గుర్తించి, ఖననం చేసేందుకు స్థానిక అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.