టునీసియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళ్తోన్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
దేశ రాజధాని టునీస్ నుంచి ఐన్ద్రాహం వైపు బస్సు వెళుతున్న క్రమంలో ఐన్స్నౌసీ ప్రాంతంలో కొండపైనుంచి లోయలోకి దూసుకెళ్లింది బస్సు. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో ఉన్న వారంతా టునీసియన్లేనని గుర్తించారు అధికారులు.