తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 7:51 AM IST

ETV Bharat / international

గ్రామాలపై తీవ్రవాదుల దాడి- 100 మంది మృతి

నైజర్​లో ఇస్లామిక్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు వంద మంది మరణించారు. ఈ గ్రామాలను నైజర్ ప్రధాని సందర్శించారు.

Attacks on 2 villages in Niger kill at least 100 people
గ్రామాలపై తీవ్రవాదుల దాడి- 100 మంది మృతి

ఆఫ్రికా దేశం నైజర్​లో జరిగిన ఇస్లామిక్ తీవ్రవాదుల దాడిలో సుమారు వంద మంది మరణించారు. మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న రెండు గ్రామాలపై శనివారం ఈ దాడి జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను స్థానికులు మట్టుబెట్టిన తర్వాత ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ గ్రామాలను నైజర్ ప్రధాని బ్రిగి రఫానీ సందర్శించారు. మృతులకు నివాళులు అర్పించారు.

ఇటీవల బోకోహారం, అల్​ఖైదా వంటి ఉగ్రసంస్థల కార్యకలాపాలు నైజర్​లో పెచ్చుమీరుతున్నాయి. ఆ దేశంలో వరుస దాడులకు పాల్పడుతున్నాయి. వేలాది మంది ఈ ఘటనల్లో మృత్యువాత పడుతున్నారు. లక్షల మంది ఆచూకీ కోల్పోతున్నారు. అంతర్జాతీయ సైన్యం ఈ దేశంలో పహారా కాస్తున్నప్పటికీ ఈ ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు.

దాడి తర్వాత గ్రామంలో బలగాల పహారా

ఈ పరిణామాల మధ్య నైజర్​లో రెండో విడత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి 1960లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా అధికార బదిలీ జరుగుతోంది. 74 లక్షల మంది ప్రజలు ఎన్నికల్లో ఓటేయనున్నారు.

ఇదీ చదవండి:పాములతో బాడీ మసాజ్​.. ఆరోగ్యానికి ఎంతో మేలట!

ABOUT THE AUTHOR

...view details