వరుస దాడులతో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి ఉలిక్కిపడింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లాం వేర్పాటువాదులు ఈ ఘాతుకానికి ఒడికట్టినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
మంగళవారం.. బండియాగారా-బంకాస్ మధ్య ఓ మిలిటరీ కాన్వాయ్పై జిహాదీలు జరిపిన దాడిలో 10మంది పౌరులు మరణించారు.