తెలంగాణ

telangana

ETV Bharat / international

అల్జీరియాలో నియంత పాలనపై ప్రజాగ్రహం - నిరసనలు

ఆఫ్రికా దేశం అల్జీరియాలో సైనిక నియంత అహ్మద్ గైద్​ సలాహ్​ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు గత 12 వారాలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం కావాలని డిమాండ్​ చేస్తున్నారు.

అల్జీరియాలో నియంత పాలనపై ప్రజాగ్రహం

By

Published : May 11, 2019, 6:12 AM IST

Updated : May 11, 2019, 7:30 AM IST

అల్జీరియాలో నియంత పాలనపై ప్రజాగ్రహం

అల్జీరియాలో సైనిక నియంత అహ్మద్​ గైద్​ సలాహ్​ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు 12వ వారానికి చేరుకున్నాయి. ముస్లింల పవిత్రమాసం రంజాన్​లోనూ... రాజధాని అల్జీర్స్​తో పాటు మిగతా పట్టణాల్లోనూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.

సైనికాధ్యక్షుడు అహ్మద్​ సలాహ్​ గద్దె దిగాలని నిరసనకారులు డిమాండ్​ చేశారు. దేశానికి పౌర ప్రభుత్వమే తప్ప నియంత పాలన వద్దంటూ నినాదాలు చేశారు.

దేశాధ్యక్షుడు అబ్దెలజీజ్​ బౌటేఫ్లికాకు వ్యతిరేకంగా ప్రజలు ఫిబ్రవరి 22న నిరసన ఉద్యమం చేపట్టారు. ఫలితంగా ఆయన ఏప్రిల్​ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన ఆర్మీ చీఫ్​ అహ్మద్​ సలాహ్​ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య, గణతంత్ర పాలన కోసం మరోమారు నిరసనలు చెలరేగాయి.

ఇదీ చూడండి: బ్లూ మూన్​: చంద్రయాన్​ రేస్​లో అమెజాన్

Last Updated : May 11, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details