తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2021, 1:31 AM IST

Updated : Aug 11, 2021, 7:15 AM IST

ETV Bharat / international

మంటలను అదుపు చేస్తూ 25మంది సైనికులు మృతి

అల్జీరియాలో భారీగా మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసే క్రమంలో 25 మంది జవాన్లు మృతి చెందారు. 17 మంది పౌరులు సైతం మరణించారు.

Algeria
అల్జీరియా

ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా చెలరేగిన మంటలను అదుపు చేసే క్రమంలో 25 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 17 మంది పౌరులు సైతం మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

కెబైల్​లోని రెండు ప్రాంతాల్లో మంటలు తీవ్రంగా వ్యాపించాయని, సైనికులు సహాయ చర్యలు చేపట్టి 100 మందికిపైగా రక్షించారని అధికారులు స్పష్టం చేశారు. పౌరులతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 42కు చేరిందని వివరించారు

ఇదీ చదవండి:రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు- భారీగా ఆస్తినష్టం

Last Updated : Aug 11, 2021, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details