తెలంగాణ

telangana

ETV Bharat / international

బస్సు, ట్రక్కు ఢీ- 20 మంది మృతి - ఈజిప్టులోని అసియూట్​ రాష్ట్రంలో రో్డ్డు ప్రమాదం

ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Apr 14, 2021, 8:01 AM IST

Updated : Apr 14, 2021, 9:13 AM IST

ఈజిప్టు అసియుట్​ రాష్ట్రంలో బస్సు, ట్రక్కు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మరణించారు. మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు.

రోడ్డు ప్రమాదానికి గురైన బస్సు

కైరో నుంచి 320 కిలోమీటర్లు ప్రయాణించిన బస్సు.. అసియుట్ రాష్ట్రంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే ట్రక్కుని ఓవర్​టేక్​ చేయడానికి ప్రయత్నించే సమయంలో బోల్తా పడింది. వేగంగా ఉన్న ట్రక్కు, బోల్తా పడిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి.

సమాచారం అందుకున్న అధికారులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:పాఠశాలలో కాల్పుల కలకలం - ఒకరు మృతి

:ఇరాన్​ 'అణు' దూకుడు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు!

Last Updated : Apr 14, 2021, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details