బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. నగరంలోని ఓ రెస్టారెంటులో బాంబులతో నిండిన వాహనంతో దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
శుక్రవారం రాత్రి.. పేలుడు పదార్థాలతో ఓ వాహనం నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లోకి దూసుకెళ్లేలా చేసి.. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించిగా.. రెస్టారెంట్తో పాటు సమీపంలోని గృహ సముదాయాలు ధ్వంసమయ్యాయి.