తెలంగాణ

telangana

ETV Bharat / international

మాలిలో వేటగాళ్ల ఊచకోతకు 115 మంది బలి

మాలిలోని ఫులాని​ తెగ ప్రజలపై డోగోన్​ తెగకు చెందిన వేటగాళ్లు ఊచకోతకు పాల్పడ్డారు. ఈ దాడిలో కనీసం 115 మంది మరణించి ఉంటారని స్థానిక సైన్యాధికారులు వెల్లడించారు.

By

Published : Mar 24, 2019, 7:13 AM IST

మాలి

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో దారుణం చోటు చేసుకుంది. సెంట్రల్​ మాలిలోని ఒగొసాగౌ గ్రామంలో ఫులాని తెగకు చెందిన పౌరులను ఊచకోత కోశారు డోగోన్ తెగకు చెందిన వేటగాళ్లు.

అంతర్గత హింసాత్మక ఘటనలు తరచూ జరిగే బుర్కినా ఫాసో సరిహద్దు ప్రాంతం బాన్కాస్​లో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.తుపాకులు, కత్తులతో వేటగాళ్లు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో 115 మంది మరణించినట్లు పొరుగునే ఉన్న ఒయెనకొరో మేయర్​ చిక్​ హోరౌన నిర్ధరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

ఫులాని​ తెగపై ఇటీవల దాడులు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఏడాది జనవరిలోనూ ఇదే తరహా దాడిలో 37 మంది గ్రామస్థులను పొట్టనపెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details