హైదరాబాద్ ఉప్పల్లో భాజపా, తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉప్పల్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేయింస్తున్నారంటూ ఆరోపించారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులను తయారుచేయించి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వారు పేర్కొన్నారు.
ఉప్పల్లో రీపోలింగ్కు డిమాండ్, సర్దిచెప్పిన పోలీసులు - జీహెచ్ఎంసీ పోల్స్
ఉప్పల్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ భాజపా, తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భరత్నగర్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్లోకి ఇతర ప్రాంతాలకు చెందిన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు.
![ఉప్పల్లో రీపోలింగ్కు డిమాండ్, సర్దిచెప్పిన పోలీసులు trs, bjp workers protest at uppal in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9725814-thumbnail-3x2-uppal.jpg)
ఉప్పల్లో భాజపా, తెరాస కార్యకర్తల ఆందోళన
ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారికి పోలీసులు నచ్చి జెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
ఇదీ చదవండి:ఓటు వేసిన కురువృద్ధురాలు