తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 4:09 AM IST

ETV Bharat / ghmc-2020

కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్​ రెడ్డి

రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలని మల్కాగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు.

mp revanth reddy campaign in ghmc elections in medchal district
కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్​ రెడ్డి

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి దూసుకెళ్తున్నారు. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలోని సురారం, సుభాష్​నగర్, జీడిమెట్ల డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు.

గతంలో తెరాస ఇచ్చిన హామీలు అమలు జరగలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్​ను గెలిపిస్తే వరద బాధితులకు రూ.50 వేలు ఇస్తామని తెలిపారు. తనకు 30 మంది కార్పొరేటర్లను ఇవ్వాలని కోరారు. ప్రశ్నించే గొంతుకకు వీరు తోడైతే ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు.

కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్​ రెడ్డి

ఇదీ చదవండి:తీరం దాటుతూ 'నివర్​' తుపాను బీభత్సం

ABOUT THE AUTHOR

...view details