తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షారుక్​-సల్మాన్ భారీ స్కెచ్​​​​.. ఆమిర్​ 'లాల్‌సింగ్‌ ఛద్ధా'కు పద్నాలుగేళ్లు - షారుక్ సల్మాన్​

షారుక్​ ఖాన్​-సల్మాన్​ ఖాన్ కలిసి ఓ భారీ యాక్షన్​ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ దీన్ని నిర్మించబోతున్నారట. మరోవైపు, ఆమిర్​ ఖాన్​ నటించిన 'లాల్‌సింగ్‌ ఛద్ధా'కు త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని రూపొందించాలని సరిగ్గా పద్నలుగేళ్ల కిందట అనుకున్నారట. ఇన్నాళ్లకు ఇప్పుడది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sharukh Salman Aamir khan
షారుక్​ సల్మాన్ ఆమిర్​

By

Published : Jul 5, 2022, 7:54 AM IST

Sharukh-Salman khan movie: గతకొంతకాలంగా భారత సినీ ఇండస్ట్రీలో దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతోంది. దీని ప్రభావం ఉత్తరాది పరిశ్రమపై పడుతోంది. అక్కడి స్టార్ హీరోలపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో మన సినిమాలను తలదన్నేలా ప్రాజెక్ట్​లను రూపొందించాలని అక్కడి దర్శకులు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా భారీ యాక్షన్​ కథలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే ఈ క్రమంలోనే సినీప్రియులకు కిక్​నిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది.

బాలీవుడ్​ స్టార్ హీరోలు షారుక్​ ఖాన్​, సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్​లో ఓ భారీ యాక్షన్‌ చిత్రం రూపొందనుందని, ఈ ఇద్దరూ చేస్తున్న సూపర్‌ హీరోల పాత్రల మేళవింపుగా ఆ సినిమా తెరకెక్కనుందని హిందీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్‌లో టైగర్‌ అనగానే సల్మాన్‌ఖాన్‌ గుర్తొస్తారు. ఆయన చేసిన 'టైగర్‌ జిందా హై', 'ఏక్‌ థా టైగర్‌' సినిమాల ప్రభావమే అది. 'పఠాన్‌'గా వచ్చే యేడాది బాద్​షా సందడి చేయనున్నారు. 'టైగర్‌3' సినిమాలోనూ షారుక్​ 'పఠాన్‌'గా ఓ అతిథి పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ చేస్తున్న టైగర్‌, పఠాన్‌ పాత్రల్ని కలిపి ఓ భారీ యాక్షన్‌ చిత్రం చేయాలనేది యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యచోప్రా ఆలోచన. ఆ దిశగా ఆయన కథనీ సిద్ధం చేశారనేది బాలీవుడ్‌ వర్గాల సమాచారం. టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌గా రూపొందే అవకాశాలున్నాయనేది టాక్​. అదేగనక నిజమైతే 1995లో వచ్చిన 'కరణ్‌ అర్జున్‌' తర్వాత షారుక్‌, సల్మాన్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ఇదే అవుతుంది.

'లాల్‌సింగ్‌ ఛద్ధా'కు పద్నాలుగేళ్లు.. అదేంటి? సినిమా ఇంకా విడుదల కాకముందే 'లాల్‌సింగ్‌ ఛద్ధా'కు పద్నాలుగేళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఔను.. ఈ చిత్ర ఆలోచన ఊపిరి పోసుకుంది పద్నాలుగేళ్ల కిందటే. జులై 4, 2008లోనే అబ్బాస్‌ టైర్‌వాలా తెరకెక్కించిన 'జానే తూ.. యా జానే నా?' విడుదలైంది. దీన్ని ఆమిర్‌ఖాన్‌ నిర్మించారు. ఆ సినిమా ప్రీమియర్‌ రోజున ఆమిర్‌, అతుల్‌కులకర్ణి పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. ఈ చర్చల్లోంచి లాల్‌సింగ్‌ ఛద్ధా కథ రాసేలా అతుల్‌లో స్ఫూర్తి నింపారు ఆమిర్‌. తర్వాత హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం 'ఫారెస్ట్‌ గంప్‌' ఆధారంగా ఈ కథ సిద్ధం చేశారు. కానీ హాలీవుడ్‌ చిత్ర హక్కుల కోసం ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ఎనిమిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. అద్వైత్‌ చవాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కరీనాకపూర్‌ ఖాన్‌ కథానాయికగా నటిస్తోంది. నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇదీ చూడండి: క్రేజీ కాంబో.. త్వరలోనే తాప్సీ-సమంత సినిమా

ABOUT THE AUTHOR

...view details