Thandel Muhurtham Ceremony :టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం 'తండేల్'. మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్గా ప్రారంభమైంది. హైదరాబార్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్, సాయి పల్లవి, అల్లు అరవింద్తో పాటు మూవీ టీమ్ హాజరైంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరోవైపు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మూవీస్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో 'లవ్ స్టోరీ' సినిమాలో చైతూ సరసన నటించింది. ఆ మూవీ మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అందుకుంది. ఆ తర్వాత తండేల్లో మరోసారి ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
Thandel Movie Story : ఇక మూవీ విషయానికి వస్తే.. బతుకుతెరువు కోసం గుజరాత్లోని 'వీరవల్'కు వెళ్లి సముద్రవేట చేస్తున్న కొందరు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు.. కష్టాల గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ కాకులానికి వెళ్లిన చిత్ర బృందం అక్కడున్న మత్స్యకారులను పలకరించి..వాళ్ల అలవాట్ల గురించి తెలుసుకున్నారు.
Thandel Movie Cast : యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.