బాలీవుడ్లో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. బడా స్టార్లు అందరూ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, అక్షయ్ కుమార్లకు కొవిడ్ పాజిటివ్ అని తేలగా తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కత్రినా కైఫ్లు చేరారు. వీరితో పాటు మరికొంత మంది నటీనటులకు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం.
బాలీవుడ్లో కరోనా కలకలం.. షారుక్, కత్రినాలకు పాజిటివ్.. మరో 50 మందికి కూడా! - షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, కత్రినాకైఫ్లు కరోనా బారినపడ్డారు. వీరితో పాటు ఇప్పటికే అక్షయ్ కుమార్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్ మొదలైన నటులకు కూడా పాజిటివ్ అని తేలింది. వీరంతా గతవారం కరణ్జోహార్ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు.
![బాలీవుడ్లో కరోనా కలకలం.. షారుక్, కత్రినాలకు పాజిటివ్.. మరో 50 మందికి కూడా! covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15479874-thumbnail-3x2-srk-covid.jpg)
ఆ పార్టీ వల్లేనా?: ఇలా వరుసగా అందరికీ కరోనా పాజిటివ్లు రావడం వెనుక కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీనే కారణం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కరణ్ ఇల్లు కొవిడ్ హాట్స్పాట్గా మారిందని పేర్కొంటున్నారు. ఆ పార్టీకి వచ్చిన వారిలో సుమారు 40-50 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయాన్ని కరణ్ సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కరణ్ ఇల్లు కొవిడ్ హాట్స్పాట్ ఏం కాదని స్పష్టం చేశారు. కరణ్ నిర్వహించిన ఆ పార్టీకి సల్మాన్, షారుక్, అనన్య పాండే, విక్కీ కౌషల్ - కత్రినా దంపతులు, ఐశ్వర్యరాయ్ సహా ఎందరో బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
ఇదీ చూడండి :నయన్-విఘ్నేశ్ పెళ్లి కన్ఫామ్.. సీఎంకు ఆహ్వాన పత్రిక