తెలంగాణ

telangana

జాక్వెలిన్​కు ఈడీ షాక్​.. ఆ కేసులో రూ.7 కోట్ల ఆస్తులు అటాచ్

Jacqueline Fernandez: మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాక్‌ ఇచ్చింది. ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.

By

Published : Apr 30, 2022, 2:58 PM IST

Published : Apr 30, 2022, 2:58 PM IST

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌
జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

Money Landering Case Jacqueline Fernandez: వ్యాపారవేత్త సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించి మనీలాండరింగ్​ కేసులో బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​కు చుక్కెదురైంది. ఈ ముద్దుగుమ్మకు చెందిన రూ.7.27కోట్ల ఫిక్స్​డ్​ డిపాజిట్​ సొమ్మును ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్​ చంద్రశేఖర్​, అతడి భార్య, నటి లీనా మరియా పాల్​తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్​షీట్​లో చేర్చారు. చంద్రశేఖర్​.. జాక్వెలిన్​కు విలువైన కానుకలు ఇచ్చినట్లు గుర్తించి ఆమెను గతంలో పలు మార్లు విచారించారు అధికారులు.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

ఇదీ కేసు..రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతడిని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి:'కేజీయఫ్​ 2' @1000కోట్లు.. 'ఆచార్య' తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details