తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ.వందల కోట్లతో ఆ సినిమాకు ఇన్సూరెన్స్- స్టార్​ హీరోల మూవీల కలెక్షన్ల కన్నా ఇది ఎక్కువే!​ - highest Film Insurance movie

Robo Film Insurance Cost In India : సినిమాల కలెక్షన్లు ఎంత ఎక్కువ వస్తే సినిమా అంత హిట్ అయినట్లు టాక్. కానీ ఒక సినిమా మాత్రం ఇలాంటి కలెక్షన్ల పరంగా కాకుండా బీమా పరంగా కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ లు నటించిన సినిమాల కలెక్షన్ల కన్నా ఈ సినిమా బీమానే ఎక్కువ. ఇంతకీ ఆ సినిమా ఏంటో, దాని బీమా ఎంతో తెలుసుకుందాం.

Robo Film Insurance Cost In India
Robo Film Insurance Cost In India

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 10:24 PM IST

Robo Film Insurance Cost In India :సినిమా బీమా (ఫిల్స్‌ ఇన్సూరెన్స్‌) మన దేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. విదేశాల్లో ఈ విధానం ఇప్పటికే అమలు అవుతోంది. చిన్నా, పెద్ద సినిమాలన్న తేడా లేకుండా పాశ్చాత్య దేశాల్లో సినిమా బీమా చేస్తారు. కానీ, మన దేశంలో కేవలం 5 నుంచి పది శాతం మాత్రమే ఫిల్మ్‌ ఇన్సూరెన్స్‌ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక సినిమాలు తీసిన సందర్భాల్లో ఫిల్మ్‌ ఇన్సూరెన్స్‌ చాలా ముఖ్యం. తమిళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్‌ సినిమాలు తీయడం చాలా అరుదు. కోలివుడ్‌లో భారీ చిత్రాలకే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని నేపథ్యంలో అదే పరిశ్రమకు చెందిన రజనీకాంత్‌ సినిమా భారీ మొత్తంలో ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

మన దేశంలో అత్యంత ఖరీదైన సినిమా బీమా
ప్రముఖ హీరో రజనీకాంత్‌ నటించిన 'రోబో 2.0' సినిమా రూ.330 కోట్ల బీమాతో రికార్డు సృష్టించింది. 2016లో శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. న్యూ ఇండియా అస్యూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆ సినిమాకు బీమా రక్షణ కల్పించాయి.

అదేవిధంగా బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ నటించిన రాజ్‌కుమార్‌ హిరానీ 'పీకే' చిత్రం ఇన్సూరెన్స్‌ రికార్డు రూ.300 కోట్ల రికార్డును రోబో అధిగమించినట్లైంది. వాస్తవానికి తమిళ సినిమాలు సాధారణంగా రూ.330 కోట్లు కలెక్షన్లు వసూలు చేసే స్థితిలో లేవు. తమిళ చిత్రసీమలో బడా హీరోలు దళపతి విజయ్‌, అజిత్‌ సినిమాలే ఎక్కువ వసూళ్లు చేస్తుంటాయి. వారిద్దరూ కూడా 330 కోట్ల రూపాయల కన్నా వసూలు చేసిన సినిమాలు ఎప్పుడూ చేయలేదు.

విజయ్‌ నటించిన 'వారిసు' సినిమా రూ.306 కోట్ల కలెక్షన్లు రాబట్టగా, అజిత్‌ నటించిన 'తునివు' రూ.223 కోట్లు రాబట్టింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నటించిన చిత్రం 'గుడ్‌ న్యూస్‌' రూ.318 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా రికార్డు కలెక్షన్ల కన్నా రజనీ చిత్రం '2.0' బీమా మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

రోబో 2.0 భారీ కలెక్షన్ల రికార్డు
శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన రోబోకు సీక్వెల్‌గా రిలీజ్‌ అయిన 2.0 బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌ నటించిన ఈ చిత్రం.. అనేక వాయిదాల తర్వాత 2018లో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.744 కోట్లు వసూలు చేసింది. అత్యధిక కలెక్షన్ల రికార్డు సృష్టించిన తమిళ సినిమాగా రికార్డులకెక్కింది. ఒక్క హిందీ వెర్షన్‌ ఇండియాలో రూ.190 కోట్ల వసూలు చేసి అప్పట్లో చాలా బాలీవుడ్‌ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది.

తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో 'యానిమల్​' ట్రైలర్​ - నాన్న కోసం వైలెన్స్​లోకి

మిస్టరీని ఛేదించేందుకు వెళ్లిన నాగ చైతన్య - జర్నలిస్ట్​ సాగర్​కు ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details