తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో రాఖీ సావంత్ రచ్చ ​- వీడియో వైరల్​

హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ముంబయిలో మూవీ సక్సెస్ పార్టీ జరగ్గా.. బాలీవుడ్​ హాట్ బాంబ్ రాఖీ రచ్చ రచ్చ చేసింది. ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

By

Published : Apr 8, 2022, 4:38 PM IST

rakhi
రాఖీ సావంత్

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతోంది. హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లను సాధించింది. దీంతో ముంబయిలో సక్సెస్ పార్టీ ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ జయంతిలాల్. ఈ పార్టీకి రామ్​చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్యతోపాటు బాలీవుడ్​ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కరణ్ జోహార్, జావేద్ అక్తర్, అమీర్ ఖాన్​ సక్సెస్ సెలెబ్రేషన్స్​లో పాల్గొన్నారు.

ఈ పార్టీలో బాలీవుడ్​ హాట్ బాంబ్ రాఖీ సావంత్ కూడా మెరిసింది. ఎర్రటి అవుట్ ఫిట్​తో రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు.. 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేసి.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ను కలిశానని, తారక్ తోనూ ముచ్చటించినట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details