తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2022, 4:17 PM IST

Updated : Apr 6, 2022, 10:49 PM IST

ETV Bharat / entertainment

నేను అలా అనలేదు.. అలాంటి పోస్టులు ఆపండి: రాశీఖన్నా

దక్షిణాది చిత్ర పరిశ్రమపై హీరోయిన్​ రాశీఖన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఆ వివాదంపై రాశీఖన్నా స్పందించారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

Raashii Khanna
రాశీఖన్నా

సౌత్​ సినిమా ఇండస్ట్రీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. తన ప్రతిభకు తగిన క్యారెక్టర్లు రాలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి రాశీఖన్నా వ్యాఖ్యలు చేశారని.. గత కొన్నిరోజుల నుంచి సోషల్​మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో దక్షిణాది సినీ ప్రియులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. రాశీఖన్నాకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న నెగటివ్‌ ప్రచారంపై ఎట్టకేలకు ఆమె పెదవి విప్పారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు.

"దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ నేను వ్యాఖ్యలు చేశానంటూ కొన్ని అసత్య ప్రచారాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భాష ఏదైనా సరే.. ప్రతి పరిశ్రమ, నేను చేసే ప్రతి సినిమాపై నాకెంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండి"

రాశీఖన్నా ట్వీట్​.

‘మద్రాస్‌ కేఫ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంతోనే రాశీ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా పరాజయం పొందడంతో ఆమె దక్షిణాదివైపు అడుగులేశారు. ఇక్కడ వరుస విజయాలు అందుకుని గ్లామర్‌ డాల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె మరలా బాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ‘రుద్ర’ అనే పేరుతో విడుదలైన ఈ సినిమా రాశీకి అక్కడ మంచి మార్కులు పడేలా చేసింది. ‘రుద్ర’ విజయం అనంతరం పలు ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాశీ.. సౌత్‌ ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Last Updated : Apr 6, 2022, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details