నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్-కె'. దీపిక పదుకొణె హీరోయిన్. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమా మొదట ప్రకటించినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా మిక్కీ జె మేయర్ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్ నారాయణన్ను తీసుకోవాల్సి వచ్చింది . ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
"ప్రాజెక్ట్-కె సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ అయినప్పటికీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పటివరకూ ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తైంది. ప్రభాస్తో పాటు, దీపిక, అమితాబ్లకు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురూ కలిసి కనిపిస్తారు. ఆడియెన్స్ ఇప్పటివరకు చెందని సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఓ ఐదారు కంపెనీలు చేస్తున్నాయి. వాటిని తెరపై చూసినప్పుడు న భూతో నభవిష్యతి అన్నట్లు ఉంటుంది." అని చెప్పుకొచ్చారు.