తెలంగాణ

telangana

నయన్, విఘ్నేశ్​ను విచారణకు పిలుస్తాం : తమిళనాడు ఆరోగ్య మంత్రి

నయనతార, విఘ్నేశ్​ శివన్​ సరోగసీ పిల్లల వివాదం ఇంకా ముదురుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి.. అవసరమైతే వారిద్దరిని విచారణకు పిలుస్తామని చెప్పారు.

By

Published : Oct 14, 2022, 9:47 PM IST

Published : Oct 14, 2022, 9:47 PM IST

Nayan Vignesh called for investigation
Nayan Vignesh called for investigation

ప్రముఖ నటి నయనతార కష్టాల్లో పడింది. ఇటీవల సరోగసీ ద్వారా నయన్, విఘ్నేశ్​ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం నిబంధనలకు లోబడే జరిగిందా అనే సందేహాలు తలెత్తాయి. దీంతో చాలా మంది ఈ జంటను ప్రశ్నించారు. ఈ విషయం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎమ్ సుబ్రమణియన్ దాకా వెళ్లింది. స్పందించిన మంత్రి రాష్ట్ర ఆరోగ్య విభాగం జాయింట్ డైరక్టర్​ అధ్యక్షతన నలుగురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే తాజాగా ఈ విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సుబ్రమణియన్ స్పందించారు. నయన్​, విఘ్నేశ్​ శివన్​లు కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఆస్పత్రిని దర్యాప్తు బృందం కనుక్కుందని తెలిపారు. ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్నామని ఆరోగ్య విభాగం జాయింట్​ డైరక్టర్ ఏ విశ్వనాథన్​ పేర్కొన్నారు.

విఘ్నేశ్​, నయన్ సరోగసీ విషయంలో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే దానిపై త్వరలోనే నివేదిక రానుంది. ఇంకా ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారా? అనే దానిపై వారంలోపు నివేదిక సమర్పించనున్నారు. అయితే ఈ విషయంలో అవసరమైతే నయన్, విఘ్నేశ్​ను విచారణకు పిలుస్తామని మంత్రి సుబ్రమణియన్​ తెలిపారు.

ఇవీ చదవండి:నాగచైతన్య మూవీలో వంటలక్క.. ఈ సినిమాతోనే వెండితెర అరంగేట్రం

'చంద్రముఖి' కానున్న 'చందమామ'.. ప్రారంభం కానున్న ప్రభాస్ కొత్త చిత్రం!

ABOUT THE AUTHOR

...view details