తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కోటబొమ్మాళి పీఎస్' టీజర్ ఔట్ - సస్పెన్స్ థ్రిల్లర్​తో శ్రీకాంత్ కమ్​బ్యాక్ అదుర్స్! - కోట బొమ్మాళి సినిమా నటీనటులు

Kotabommali PS Teaser : హీరో శ్రీకాంత్ - వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించింన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఈ సినిమా టీజర్​ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది.

kota bommali teaser
kota bommali teaser

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 7:21 PM IST

Updated : Nov 6, 2023, 8:46 PM IST

Kotabommali PS Teaser : ఆంధ్రప్రదేశ్ శ్రీకాకులం జిల్లా బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిన చిత్రం 'కోట బొమ్మాళి పీఎస్'. డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కించిన ఈ సినిమాలో.. హీరో శ్రీకాంత్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జీ ఏ2 పిక్చర్స్​ బ్యానర్​పై బన్నీవాస్ రూపొందిస్తున్నారు. అయితే సోమవారం మూవీయూనిట్.. ఈ సినిమా టీజర్​ను రిలీజ్ చేశారు. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్​గా ఉన్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి మీరు టీజర్ చూశారా.

టీజర్​లో ఏముంది? సినిమాలో హీరో శ్రీకాంత్ పాత్ర పేరు రామకృష్ణ. అయితే రామకృష్ణ కోట బొమ్మాళి గ్రామ పోలీస్​ స్టేషన్​లో ఓ కానిస్టేబుల్​గా పనిచేస్తారు. తాను చేయని తప్పుకు కానిస్టేబుల్ రామకృష్ణ.. కేసులో ఇరుక్కొని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు టీజర్​లో చూపించారు. అయితే రామకృష్ణ కేసు ఓ రాజకీయ నాయకుడి భవిష్యత్​పై ఆధారపడినట్లు కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నత స్థాయి పోలీస్ అధికారి. రామకృష్ణ కేసు ఛేదించేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఆమెపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంటుంది. మరి రామకృష్ణ ఆ కేసు నుంచి ఎలా బయటపడతాడు? చివరికి ఆ పొలిటిషియన్ పరిస్థితేంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే. అయితే సస్పెన్స్ థ్రిల్లర్, పొలిటికల్ మిక్స్​ ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక టీజర్ మధ్యలో 'గన్​ కన్నా పెన్​ ఫోన్​ బాగా పేలుతుంది సార్', 'గన్​ గవర్నమెంట్​ది వేలు మాత్రమే మనది' డైలాగులు ఆడియెన్స్​ను ఆకట్టుకుంటున్నాయి.

Kotabommali PS Movie Cast :ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాణి రాజశేఖర్, నటుడు మురళీ శర్మ, రాహుల్ విజయ్, విష్ణు, దయానంద్ రెడ్డి, రామారావ్ జాదవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. జగదీశ్ చీకటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఈ సినిమా వరల్డ్​వైడ్​గా నవంబర్ 24న గ్రాండ్​గా థియేటర్లలో విడుదల కానుంది.

ఎవరీ తేజ మార్ని.. దర్శకుడు తేజ మార్ని.. తెలుగులో దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఆయన ఇదివరకు హీరో విష్ణు ప్రాధాన పాత్రలో ఆర్జున ఫాల్గుణ సినిమా తెరకెక్కించారు. 2021లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్​డ్ టాక్​ సొంతం చేసుకుంది. అంతకుముందు 'జోహార్' సినిమాతో తేజ దర్శకుడిగా పరిచయమయ్యారు.

మెరుగవుతున్న రాజశేఖర్ ఆరోగ్యం: జీవిత

ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా: శివాని రాజశేఖర్

Last Updated : Nov 6, 2023, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details