ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను బాగా అలరించారు సీనియర్ నటి రోజా. టాలీవుడ్లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించారు. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకున్నారు. అలాగే బుల్లితెర షో అయిన జబర్దస్త్లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్ క్రేజ్ను సంపాదించుకున్నారు.
అయితే రాజకీయాల్లో మరిన్ని బాధ్యతలు పెరగడం వల్ల ఈ షో నుంచి తప్పుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో రోజాను ఇకపై షోల్లో కనిపించరని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆమె త్వరలోనే దసరా పండగ సందర్భంగా ఈటీవీ ఛానల్లో ప్రసారం కానున్న ఓ ప్రత్యేక షో ద్వారా కనువిందు చేయనున్నారు. ఇటీవలే దసరా వైభవం పేరుతో దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో భాగంగానే రోజాను స్టేజీపై ఘనంగా సన్మానించారు.