Hanuman Pre Release Business :యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్'.సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో జనవరి 12న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా, ఓవర్సీస్లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ఏయే ప్రాంతంలో ఎంత వసూలు చేసిందంటే ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ డిస్ట్రీబ్యూటర్గా వ్యవహరిస్తోంది. ఇక నైజాం థియేట్రికల్ రైట్స్కు 7.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. అలా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు రూ. 21.5 కోట్ల మేర అమ్ముడయ్యాయని సమాచారం.
మరోవైపు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్కు మంచి రెస్పాన్స్ లభించిందట. ఇందులో భాగంగా ఈ చిత్ర హక్కులు రూ. 2 కోట్ల మేర అమ్ముడుపోయాయని టాక్ నడుస్తోంది. ఇక ఓవర్సీస్ రైట్స్ కూడా రూ. 4 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. దీంతో ఇప్పటి వరకు హనుమాన్ సినిమా రూ. 27.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. దీంతో లాభాల్లోకి రావాలంటే ఈ చిత్రం సుమారు రూ. 28.5 కోట్లు వసూలు చేయాలని విశ్లేషకుల మాట.