Director Krishna vamsi 300 crore budget film: ప్రయోగాత్మక, కుటుంబకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొనే దర్శకుడు కృష్ణవంశీ. ప్రస్తుతం 'రంగమార్తాండ' సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్లతో ప్రాజెక్ట్ను రూపొందించే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓటీటీ ఎంట్రీపై ఆయన స్పందించారు.
"ఓటీటీ కోసం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తా. ఇప్పుడే దాని గురించి చెప్పను కానీ తప్పకుండా అది పెద్ద ప్లాన్ అవుతుంది. రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ సిద్ధమయ్యే అవకాశం ఉంది. మనం ఏది అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉంటుంది. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఉండదు" అని కృష్ణవంశీ వివరించారు.