తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆదిపురుష్​ డైరెక్టర్​కు గిఫ్ట్​గా లగ్జరీ కారు!.. నిజమేనా?

ఆదిపురుష్​ రిలీజ్​కు ముందే దర్శకుడు ఓం రౌత్​కు​ ఖరీదైన కారును బహుమతిగా అందుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజంగానే ఆయన కారు గిఫ్ట్​గా అందుకున్నారా? వార్తల్లో నిజమెంత?

By

Published : Oct 19, 2022, 3:25 PM IST

Updated : Oct 20, 2022, 8:14 AM IST

Adipurush director luxury car
ఆదిపురుష్​ డైరెక్టర్​కు గిఫ్ట్​గా లగ్జరీ కారు.. వామ్మో అన్ని కోట్లా?

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఇది యానిమేటెడ్​ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్‌ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందే దర్శకుడు ఓం రౌత్‌ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నట్లు సోషల్​ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆది పురుష్‌ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న టీ-సిరీస్‌ అధినేత భూషన్‌ కుమార్‌.. ఓం రౌత్​కు రూ.4.02 కోట్ల విలువైన కారు గిఫ్ట్​ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అసలు నిజం అది కాదు. సరదాగా ఓం రౌత్​, భూషన్​ కుమార్​ ఒక ఫొటో తీసుకుని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారట. దీంతో లగ్జరీ కారు గిఫ్ట్​గా ఇచ్చినట్లు ఊహాగానాలు వచ్చాయి.

ఇక ఆదిపురుష్ విషయానికొస్తే.. చెడుపై మంచి గెలుపు చుట్టూ సాగే కథ ఇది. ప్రభాస్‌ రాఘవగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌ పాత్రల్లో కనిపిస్తారు. త్రీడీతోపాటు, ఐమాక్స్‌ ఫార్మేట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది.

ఇదీ చూడండి: అప్పుడే రాజమౌళి అలాంటోడని అర్థమైంది: ఏఆర్ రెహ్మాన్​ కామెంట్స్​ వైరల్​

Last Updated : Oct 20, 2022, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details