తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2022, 2:52 PM IST

ETV Bharat / entertainment

'అందుకే అప్పుడు సమంత.. ఇప్పుడు దీపికపై ట్రోల్స్​'

హీరోయిన్లు​ దీపికా పదుకొణె, సమంత ట్రోల్స్​కు గురి కావడంపై స్పందించారు నటి రమ్య. ఏం అన్నారంటే..

Deepika padukone samantha trolls
'అప్పుడు సమంత.. ఇప్పుడు దీపికపై అందుకే ట్రోల్స్​'

స్త్రీ ద్వేషంతోనే పలువురు హీరోయిన్​ దీపికా పదుకొణెను ట్రోల్‌ చేస్తున్నారని కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య అన్నారు. స్త్రీ వ్యతిరేకతపై ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'బేషరమ్‌ రంగ్‌' పాట వివాదంపై స్పందించిన ఆమె.. సమంత, రష్మిక పేర్లను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఆయా నటీమణులు ఏ విషయంలో ట్రోల్స్‌ ఎదుర్కొన్నారో చెప్పారు.

"విడాకులు తీసుకుందనే కారణంతో సమంతను అప్పట్లో ట్రోల్‌ చేశారు. అలాగే, తన అభిప్రాయాన్ని బయటపెట్టినందుకు సాయిపల్లవి, ఓ నటుడి నుంచి విడిపోయినందుకు రష్మిక, కురచ దుస్తులు వేసుకుందని దీపిక.. ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది మహిళలు ఇలాంటి చిన్న చిన్న కారణాలకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. దుర్గాదేవి ప్రతిరూపాలే మహిళలు. స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది" అని రమ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కన్నడలో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించిన రమ్య.. 'అభిమన్యుడు'తో తెలుగు తెరకు పరిచయమ్యారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది.

ఇదీ చూడండి:బాలీవుడ్​లో బేషరమ్ దుమారం ముకేశ్ ఖన్నా తీవ్ర ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details