సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఉంది. ఎంతగా అంటే ఏ చిన్న విషయమైనా అంతర్జాలంలో పోస్ట్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తుంటారు. ఎన్నికల గురించి మాట్లాడుకుంటూ ఎక్కువ ట్వీట్లు చేసింది ఈ లోక్సభ ఎన్నికల్లోనే. జనవరి నుంచి ఇప్పటివరకు 396 మిలియన్ల (39.6కోట్లు) ట్వీట్లు.. నెటిజన్లు చేశారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో 56 మిలియన్ల (5.6కోట్లు) ట్వీట్లు రాగా.. ఈ సారి అంతకు ఆరు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి.
ఒక్క గురువారమే 3.2 మిలియన్ల (32లక్షల) ట్వీట్లు చేశారు ప్రజలు. ఇందులో ఆసక్తికర విషయమేంటంటే మూడో వంతు ట్వీట్లు మధ్యాహ్నం 3 నుంచి 4