తెలంగాణ

telangana

ETV Bharat / elections

ఎక్కువ మంది నేరచరితులు, కోటీశ్వరులే

2019 సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ఏప్రిల్​ 18న జరగనుంది. ఇందులో పోటీ పడే అభ్యర్థుల్లో 16% మందిపై క్రిమినల్​ కేసులున్నట్లు ఎన్నికల పర్యవేక్షణ సంస్థ ఏడీఆర్​ అధ్యయనంలో తేలింది.

By

Published : Apr 14, 2019, 3:28 PM IST

Updated : Apr 14, 2019, 5:36 PM IST

ఎక్కువ మంది నేరచరితులు, కోటీశ్వరులే

రెండో విడత ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులపై ఏడీఆర్​ నివేదిక

ఏప్రిల్​ 18న జరగబోయే సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో పోటీ పడే అభ్యర్థుల్లో 16 శాతం మందిపై క్రిమినల్​ కేసులున్నట్లు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​ (ఏడీఆర్​) వెల్లడించింది. 1644 మంది అభ్యర్థులకు గాను 1590 మంది అభ్యర్థుల ప్రమాణపత్రాలను పరిశీలించి ఈమేరకు నివేదిక రూపొందించింది ఏడీఆర్​.

2వ దశకు పోటీపడుతున్నవారిలో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 167 మంది అంటే 11% అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఏ పార్టీలో ఎంతమంది?

పార్టీ అభ్యర్థులు క్రిమినల్​ కేసులు తీవ్రమైనవి
భాజపా 51 16 (31%) 10(20%)
కాంగ్రెస్ 53 23 (43%) 17 (32%)
బీఎస్పీ 80 16 (20%) 10 (13%)
అన్నాడీఎంకే 22 3 (14%) 3 (14%)
డీఎంకే 24 11 (46%) 7 (29%)
శివసేన 11 4 (36%) 1 (9%)

అభ్యర్థుల్లో కోటీశ్వరులు..

రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 423 మంది(27%) తమకు రూ.కోటికి మించి ఆస్తులున్నట్లు చూపారు. పోటీ పడుతున్న అభ్యర్థుల సగటు ఆస్తి రూ.3.90 కోట్లు.
అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కోటీశ్వరులే.

పార్టీ అభ్యర్థులు కోటీశ్వరులు
భాజపా 51 45 (88%)
కాంగ్రెస్ 53 46 (87%)
బీఎస్పీ 80 21 (26%)
అన్నాడీఎంకే 22 22 (100%)
డీఎంకే 24 23 (96%)
Last Updated : Apr 14, 2019, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details