తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2021, 11:22 AM IST

Updated : Mar 29, 2021, 1:47 PM IST

ETV Bharat / crime

మక్తల్‌ శివారులో మహిళ దారుణ హత్య

మక్తల్‌ శివారులో మహిళ దారుణ హత్య జరిగింది. దుండగులు మహిళను చంపి.. తగులబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

woman brutally murder,narayanpet district
మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్య

నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మక్తల్ శివారులోని వడ్వాట్ గ్రామానికి వెళ్లే పాత రోడ్డు మార్గంలో ఓ మహిళని దుండగులు కాల్చిచంపారు. మద్యం మత్తులో మహిళని కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మొదట యువతిగా గుర్తించిన తర్వాత మృతదేహం పక్కనే పగిలిన గాజులు ఉన్నాయి. ఆ మహిళ వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళను రాయితో గానీ, ఇనుప రాడ్​తో గానీ తలపై బలంగా కొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చంపిన అనంతరం మహిళను ముళ్లపొదల్లో వేసి తగల పెట్టారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.

Last Updated : Mar 29, 2021, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details