తెలంగాణ

telangana

భువనగిరి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

By

Published : Feb 15, 2021, 10:14 AM IST

Published : Feb 15, 2021, 10:14 AM IST

Breaking News

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి పారిశ్రామిక వాడలోని సాయి కృష్ణ ఇండస్ట్రీస్​లో(ప్లాస్టిక్ గ్రాన్యూయల్స్ కంపెనీ ) అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో మంటలు పక్క పరిశ్రమలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్​లతో మంటలు ఆర్పుతున్నారు.

ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:అల్లుడు అప్పు తీర్చడం లేదని.. మనవడిని అమ్మిన అత్త.!

ABOUT THE AUTHOR

...view details