తెలంగాణ

telangana

By

Published : May 27, 2021, 7:12 AM IST

ETV Bharat / crime

భర్తకు బ్లాక్ ఫంగస్.. ఆసుపత్రిలో భార్య ఆత్మహత్య

ఏపీలోని కాకినాడ జీజీహెచ్​ ఆసుపత్రి గదిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్తకు బ్లాక్ ఫంగస్ సోకడంతో మనోధైర్యం కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

women-suicide-at-east-godavari-kakinada-ggh
భర్తకు బ్లాక్ ఫంగస్.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త బ్లాక్ ఫంగస్​తో చికిత్స పొందుతుండగా.. ఆయనతో పాటు ఉన్న భార్య బుల్లిమావతి(48) మనస్తాపంతో ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.

పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతికి కొవిడ్ సోకింది. చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ రావడంతో కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు. భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో.. మనోధైర్యం కోల్పోయిన మహిళ ఈ ఉదయం ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఇవీ చదవండి:corona effect: స్మైల్‌ ప్లీజ్‌.. అనే వారి జీవితాల్లో కానరాని సంతోషం

ABOUT THE AUTHOR

...view details