తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2021, 5:32 PM IST

ETV Bharat / crime

భర్త వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక తనువు చాలించిన భార్య.!

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన మహిళ.. ఆత్మహత్యకు పాల్పడింది. తమ బిడ్డ మరణానికి ఆమె భర్త అంజన్ కృష్ణనే కారణమని.. కఠినంగా శిక్షించాని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

woman died
woman died

విజయవాడ మొగల్రాజపురం సున్నం బట్టిల వద్ద ఓ వివాహిత అనుమాస్పదంగా మృతి చెందింది. గతేడాది అక్టోబర్​లో రేణుకకు అంజన్ కృష్ణతో వివాహం జరిగింది. రెండు నెలల అనంతరం అంజన్ కృష్ణకు మరో మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం బయటపడింది. ఈ క్రమంలో తరచూ వివాదాలు జరిగేవని తెలుస్తోంది.

తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురిచేసేవాడని మృతురాలి తల్లిదండ్రులు అరోపించారు. భార్యను అనేకసార్లు చనిపోవాలని తిట్టే వాడని.. చివరకు చనిపోవడానికి కారణమయ్యాడని తెలిపారు.

అంజన్ కృష్ణను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంజన్ కృష్ణ పరారీలో ఉన్నాడు.

ఇదీ చూడండి: LIVE VIDEO: ఫేస్​బుక్​ లైవ్​లో వ్యక్తి ఆత్మహత్య... ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details