తెలంగాణ

telangana

ETV Bharat / crime

అడవి పందుల స్వైర విహారం.. ఒకరికి గాయాలు

అడవి పంది దాడిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలో చోటు చేసుకుంది.

By

Published : Mar 4, 2021, 1:16 PM IST

Wild boars roamed the village of Mattamala in the Ellareddy zone of Kamareddy district.
అడవి పందుల స్వైర విహారం.. ఒకరికి గాయాలు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో అడివి పందులు స్వైర విహారం చేశాయి. దారి తప్పి గ్రామంలో ప్రవేశించి ఎదురొచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి.. ఓ వ్యక్తిపై దాడి చేశాయి.

ఈ ఘటనలో మల్కాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య కాలును గాయపరిచి పాఠశాలలోకి పరుగులు తీశాయి. ఆ సమయంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. నిజాంసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో అడవిపందులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:న్యాయవాదుల హత్యకేసు: నిందితులు కోర్టులో హాజరు

ABOUT THE AUTHOR

...view details