సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. స్టేషన్లోని పదో నంబరు ప్లాట్ ఫాంపై వృద్ధుడు(65)మృతి చెందినట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు.
రైల్వే ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని మృతదేహం - సికింద్రాబాద్ క్రైం వార్తలు
రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై విశ్రాంతి తీసుకుంటున్న గుర్తు తెలియని వృద్ధుడు మరణించాడు. గమనించిన సిబ్బంది రైల్వే పోలీసులకు తెలిపారు. ఈ ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది.
![రైల్వే ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని మృతదేహం Unknown dead body on railway platform, secunderabad crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11559078-1061-11559078-1619533118483.jpg)
రైల్వే ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని మృతదేహం
ఈ మేరకు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అతనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడం వల్ల ఉస్మానియా మార్చురీకి తరలించారు. అతడు అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి :కొవిడ్ బాధితుడు ఆత్మహత్యాయత్నం